“ఉన్నట్టు కనిపించేది కాదు — ఉన్నదే నీవు”-వేదాంత పంచదశి
మొదటి భాగం – సారాంశం ముందుగా ఒకటే విషయం బాగా పట్టుకోవాలి. ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి — కారణం, శక్తి, కార్యం. కానీ వాస్తవంగా ఉన్నది ఒక్కటే. అది చైతన్యం. దానికి ఆకారం లేదు, లింగం లేదు, దేవుడు– మనిషి అనే భేదం లేదు. అది ఉన్నది — అంతే. ఉన్నట్టు తనకు తానే తెలుసు — అంతే. ఇవి రెండు వేరు కావు. ఉన్నదే తెలుసుకుంటుంది. తెలుసుకునేదే ఉంది. ఇదే సచ్చిత్తు. ఇప్పుడు శక్తి అంటాం, మాయ అంటాం, ప్రకృతి అంటాం — ఏ పేరు పెట్టినా అది చైతన్యానికి బయట కాదు. చైతన్యం లేకపోతే శక్తి లేదు. శక్తి లేకపోతే చైతన్యం వ్యక్తం కాదు. అందుకే శివ–శక్తి అన్నారు. రెండు కాదు. విడిపోయేలా కూడా కాదు. విడిచిపెట్టలేని సంబంధం — అవినాభావం. ఇప్పుడు ఇక్కడే మనకు తేడా వస్తుంది. మనకు రెండుగా కనిపిస్తుంది కాబట్టి “రెండు ఉన్నాయేమో” అనుకుంటాం. కానీ ఉపనిషత్తులు అలా అనలేదు. వాళ్లు “ఒకటే” కూడా అనలేదు. “రెండు కానిది” అన్నారు. అదే అద్వైతం. రెండుగా కనిపించేది ఒకటే ఉంటే — అది అద్వైతం. ఇప్పుడు ఈ చైతన్యం + శక్తి కలిసి ఏం చేస్తున్నాయి? కార్యంగా కనిపిస్తున్నాయి. మనస్సు, ప్రాణం, శరీరం, ప్రపంచం — ఇవి ఏవీ స్వతంత్ర వాస్తవాలు కావు. ఇవి అన్నీ ఆభాసాలు. రజ్జువు...